చీరాల టిడిపి అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య ప్రచారం ప్రణాళికాబద్ధంగా సాగుతోంది. నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాలను అలరించేలా టిడిపి నేతలు కొండయ్య పక్షాన ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు చీరాల వచ్చి వెళ్లిపోగా చేనేత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ ఇక్కడే మకాం చేశారు. అలాగే కాపు నేత వంగవీటి రాధా, మైనారిటీ నేత షరీఫ్ తదితరులు కూడా మంగళవారం ప్రచారం చేశారు.