ధర్మవరం నియోజకవర్గ ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ముదిగుబ్బ మండల కేంద్రంలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని చర్చి వీధి, టీచర్స్ కాలనీ, HP పెట్రోల్ బంక్ ప్రాంతాలలో పర్యటించారు. ముందుగా ఆయనకు స్థానిక నేతలు, మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.