సత్య సాయి జిల్లా మడకశిర మండలం కదిరేపల్లి గ్రామంలో కాంగ్రెస్ మాజీ సర్పంచ్ తిప్పే నరసప్ప ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ తిప్పే నరసప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.