గుంతకల్లు నియోజకవర్గం నెలగొండ గ్రామ ప్రజలు కొందరు అస్వస్థకు గురై గత రెండు రోజులుగా ప్రభుత్వా ఏరియా అసువత్రి లో చికిత్స తీసుకుంటూ ఉండటంతో బుధవారం ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా డ్యూటీ డాక్టర్ తో మాట్లాడి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోని వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుమ్మనూరి నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.