రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని ఉరవకొండ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌతమ్ కుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక ఇందిరానగర్ లో ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికంగా ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ పథకాలు అందుతాయని ఆయన తెలిపారు.