వజ్రకరూరు మండలంలోని చాబాల గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి నాలుగు గొర్రెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి నక్కల కేశప్ప తన గొర్రెలను మోపు కోసం మంగళవారం గ్రామ శివారులోని పొలాలకు తీసుకెళ్లారు. అక్కడ మద్యాహ్నం సమారు 3 గంటల సమయంలో విద్యుత్ తీగలకు తగలడంతో షాక్ కు గురయ్యాయి. దీంతో నాలుగు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయని సుమారు రూ. 50 వేలు నష్టంపోయినట్లు బాదిత గొర్రెల కాపరి తెలిపారు.