ప్రతీ ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటిస్తూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉరవకొండ సి. ఐ సురేష్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉరవకొండ మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన రేణుమాకులపల్లి, నింబగల్లు గ్రామాల్లో పోలీసులు ఫుట్ మార్చ్, గ్రామసభలు నిర్వహించారు. ఈసందర్భంగా సి. ఐ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణం కల్పిస్తాం స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.