కళ్యాణదుర్గం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన గొల్ల మనోహర్ బుధవారం విద్యుత్ షాక్ తో మృతి చెందారు. తన వ్యవసాయ పొలంలోకి వెళ్లిన మనోహర్ కు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడన్నారు. కుటుంబ సభ్యులు గమనించేలోగా మనోహర్ ప్రాణాలు కోల్పోయాడన్నారు. జరిగిన ప్రమాదాన్ని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందివ్వడంతో సంబంధిత శాఖ ఉద్యోగులు సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.