సుడిగాలుల ప్రభావంతో విద్యుత్ వైర్లు తెగిపోవడం, ఉప కేంద్రాలు బ్రేక్ డౌన్ కావడంతో మంగళవారం రాత్రి 11 గంటల నుండి బుధవారం ఉదయం 7 గంటల వరకు చీరాల చీకట్లో మగ్గింది. రాత్రంతా కరెంటు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయమై చీరాల పట్టణ డి ఈ శ్రీనివాసరావు వివరణ ఇస్తూ మే నెలలో వచ్చే ప్రకృతి వైపరీత్యాలు, పెనుగాలులు అత్యంత శక్తివంతంగా ఉండి విద్యుత్ సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తాయన్నారు.