చంద్రబాబు ఢిల్లీతో కలిసి కుట్రలు చేసిపథకాలు ఆపగలరు కానీ..మా విజయాన్ని ఆపలేరని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఓటు అనే అస్త్రంతో ఈ చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోంది. పేదవాడు ఒకవైపు..పెత్తందార్లు ఒకవైపు ఉన్నారు. ఎవరు మీకు మంచి చేశారో ..ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందన్నది మాత్రమే మీరు వేసే ఓటు నిర్ణయిస్తుందని గుర్తించుకోవాలన్నారు.