ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో తొమ్మిది ప్రశ్నలు.. సీఎం జగన్‌కు షర్మిల రెండో లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 08:44 PM

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఇటీవలే ఎస్సీ, ఎస్టీల పథకాలు, రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంటూ లేఖ రాసిన షర్మిల.. తాజాగా మద్యం నిషేధంపై తొమ్మది ప్రశ్నలు అడిగారు. గత ఎన్నికల సమయంలో మద్యం విషయంలో ఇచ్చిన హామీలు, ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు. మద్య నిషేదం గురించి నవ సందేహాల పేరుతో రెండో లేఖను రాశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.. కల్తీ బ్రాండ్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో మద్య నిషేధం హామీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. మూడు దశల్లో మద్య నిషేధం అని మోసం చేశారని.. మద్యపానం నిషేధించిన తర్వాత ఓటు అడుగుతానని అన్న మాట వాస్తవాం కాదా అన్నారు. అప్పుడే జనాల ముందుకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. మద్యం అమ్మకాల్లో రూ.20 వేల కోట్ల నుంచి 30 వేల కోట్లకు ఆదాయం పెంచుకున్నారని.. అమ్మకాల్లో అభివృద్ధి చెందినట్టు కాదా ? అన్నారు. జగన్ గతంలో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజల రక్తమాంసాలు మీద వ్యాపారం అన్నారు.. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? అంటూ ప్రశ్నించారు


దేశంలో ఎక్కడ దొరకని బ్రాండ్లను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు అంటూ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా చేయూత, ఆసరా, అమ్మ ఒడి పథకాల అమలు బాధ్యతను బెవరేజేస్ కార్పొరేషన్‌కు అప్పగించడాన్ని ఎలా సమర్ధిస్తారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 11 వేల కోట్లు రుణాలు సేకరించాలని ఎందుకు అనుకున్నారని ప్రశ్నించారు. డ్రగ్స్ పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు..? ఇందులో మీ వైఫల్యం లేదంటారా..? అంటూ జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com