ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలులో ఆవుమాంసం.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసిన పీఠాధిపతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 04, 2024, 07:14 PM

గుంటూరు రైల్వే స్టేషన్‌లో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది హిందూసంఘాల ప్రతినిధులు.. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. రైలులో అక్రమంగా ఆవుమాంసం తరలిస్తున్నారంటూ హిందూసంఘాలు ఆరోపించాయి. హిందువులు పవిత్రంగా పూజించే ఆవును వధించి అక్రమంగా తరలిస్తున్నారంటూ.. రైల్వేస్టేషన్‌లో హిందూసంఘాలు ఆందోళన చేపట్టాయి. రైలులో తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవాలని, గోమాంసం తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశాయి. దీంతో రైలు రాకపోకలకు అంతరాయం కలిగింది.


ఇదే సమయంలో తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి సైతం అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకారులతో కలిసి రైల్ రోకో నిర్వహించారు. అయితే స్టేషన్‌లో ఆందోళనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గోమాంసం తరలింపుపై దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు. పోలీసుల జోక్యంతో.. హిందూసంఘాలు ఆందోళన విరమించాయి. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే రైలు రోకో కారణంగా జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. రైలు ప్రయాణానికి ఆటంకం కలగడంతో కాసేపు ఇబ్బంది పడ్డారు. అయితే పోలీసుల జోక్యంతో రైలు తిరిగి బయల్దేరటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com