ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి పగడాల రమణ ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయసమావేశానికి జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాస రాజు శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సూపర్ సిక్స్ పథకాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు లాభం చేకూరుతుందనిఅన్నారు.