పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడు వలె పని చేయాలని రేపల్లె వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్ సతీమణి డాక్టర్ కేశవతి కోరారు. శుక్రవారం చెరుకుపల్లి పంచాయతీలోని ఎస్సీ కాలనీ, కొత్తపేట, కాపుల బజార్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసిపి సీనియర్ నాయకుడు బండారు రామారావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.