కనిగిరి మండలం గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవరపల్లి సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికలలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు 10 సంవత్సరాలపాటు ప్రత్యేక హోదా ఇస్తుందని, అలానే పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని అన్నారు.