ముఖ్యమంత్రి వైయస్ జగన్తో పెట్టుకుంటే ప్రజలు నిన్ను తొక్కి నార తీస్తారని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పవన్ కళ్యాణ్ను హెచ్చరించారు. మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడుతూ.... ప్రజలు జగనన్నకు బ్రహ్మరథం పడుతుంటే దాన్ని చూసి ఓర్వలేక, చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, పవన్లు కూటమి కడితే ప్లాప్ అయ్యింది. దీంతో బీజేపీని కూడా కూటమిలోకి తెచ్చినా అది కూడా ప్లాప్ అయ్యింది. వాళ్లు తీసుకొచ్చిన మేనిఫెస్టో కూడా అట్టర్ పాఫ్ అయ్యింది. ఆ మేనిఫెస్టోకి మేం గ్యారెంటీ ఉండము అంటూ బీజేపీ చెప్పే పరిస్థితి చూశాం. వాళ్లు ఏది చేసినా ప్లాఫ్ అవ్వడంతో జగన్ గారిపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్లో 2014–19 మధ్య ఏం చేశారో చెప్పి ఓట్లడిగితే బాగుంటుంది. అది మానేసి నిన్న విశాఖ వచ్చిన పవన్ కల్యాణ్ మాటలు విని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మాట్లాడితే చెగువీరా పేరు చెప్పుకునే ఇతను, పెద్ద పెద్ద వాళ్లు నాకు స్ఫూర్తి అనే ఇతని నిజ స్వరూపం నిన్న విశాఖ ప్రజలు చూశారు అని తెలిపారు.