శింగనమల నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే అని శైలజనాథ్ అన్నారు. ఆయన శింగనమల మండలం చిన్న జలాలపురం, వెస్ట్ నరసాపురం, నాగలగుడ్డం, గురుంగుట్ల, ఆకులేడు, లోలూరు, గుమ్మేపల్లి, గ్రామాలలో విస్తృత స్థాయిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శైలజానాథ్ మాట్లాడుతూ.. ఈరోజు ఎటు చూసినా ఎండిపోతున్న బోర్లు, బావులు, నీళ్లు రాని కుళాయిలు, గుంతలు పడిన రోడ్లు కనిపిస్తున్నాయన్నారు.