ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు మంత్రి రోజాకు భారీ షాక్ తగిలింది. కొంతకాలంగా ఆమెతో పాటు ఉన్న వైసీపీ కీలక నేతలు ఆమె వైఖరి నచ్చక జగన్ పార్టీకి రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో మంత్రి రోజా తీరుపై ఆగ్రహంతో నగరిలోని 5 మండలాల వైసీపీ నేతల రాజీనామాలు చేశారు. ఈ నేతలంతా తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు సమాచారం. నగరికి చెందిన మాజీ శ్రీశైలం బోర్డు చైర్మన్ సీనియర్ నేత రెడ్డివారి చక్రపాణి రెడ్డి, లక్ష్మిపతిరాజు, మురళీ రెడ్డి తదితర కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. రోజాపై పెట్టిన కష్టాలు, అవమానాలను భరించలేక ఇద్దరు ఎంపీటీసీలు రెడ్డివారి భాస్కర్ రెడ్డి , విజయ ఆరుమంది సర్పంచులు తులసిరెడ్డి, గోపి, ప్రభాకర్, సంపూర్ణ, జయమ్మ, మనోహర్ నాయుడు వైసీపీకి రాజీనామా చేశారు.