మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ మోసం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కైకలూరులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వారాహి భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే మీ ఆస్తులు గాల్లోపెట్టిన దీపంలా అవుతాయని ఆరోపించారు. జగన్ పార్టీ అధికారంలోకి వస్తే మన ఆస్తులను రాయించుకుంటారని విమర్శించారు. భవిష్యత్తు కూటమిదేనని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటువేయాలని కోరారు.