ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేందుకే పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎర్రగొండపాలెం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. గురువారం త్రిపురాంతకం మండల కేంద్రంలో నూతన పార్టీ కార్యాలయాన్ని నాయకులతో కలసి ప్రారంభించారు. గ్రామ సర్పంచ్, ఎంపిపి, జడ్పిటిసి, నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.