ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు ముత్తుముల్ల దివ్యస్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించి చెప్పారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.