బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ జడ్పిటిసి ప్రస్తుత సర్పంచ్ కె. సందీప్ కుమార్ ఇంట్లో ఎన్డీఏ కూటమి నాయకుడు కాపు రామచంద్ర రెడ్డి సొంత ఊరిలో గురువారం మొదటిసారిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన ఆమిలినేని సురేంద్ర బాబు, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీ నారాయణకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.