శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో ను గురువారం హిందూపురం పార్లమెంట్ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బి. కె. పార్థసారథి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీసత్య సాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు కొల్లకుంట ఆంజినప్ప, టీడీపీ నాయకులు కురుబ కృష్ణమూర్తి, మండల కన్వీనర్ సిద్దయ్య, టౌన్ కన్వీనర్ రవిశంకర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.