ఏపీలోని శ్రీశైల క్షేత్రం పరిధిలో పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వచ్చింది. నిన్నటి నుంచే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని బ్యాన్ చేసినట్లు ఆలయ ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. ఆలయం వద్దనున్న దుకాణదారులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లను విక్రయించకూడదన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా కాగితం, జూట్ సంచులు వినియోగించాలని కోరారు.