గురువారం కదిరి పట్టణంలోని అమీర్ నర్సింగ్ వైద్యశాల సమీపాన రూ. లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ పుల్లయ్య తెలిపారు. అనంతపురం జిల్లా కేంద్రంలో నివాసం ఉన్న మక్బూల్ కుమారుడు మహమ్మద్ ఇలియాజ్ రూ. లక్ష తీసుకొని వెళుతుండగా వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నగదును రిటర్నింగ్ అధికారి వంశీకృష్ణకు అప్పజెప్పినట్లు సీఐ తెలిపారు.