రాష్ట్ర ప్రజలు న్యాయం, ధర్మం వైపు నిలబడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల కోరారు. గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రూ. 40 కోట్లకు తన చిన్నాన్న వివేకాను చంపేందుకు ఒప్పందం చేసుకుని హతమార్చారని ఆరోపించారు. హంతకుడికి ఏ విధంగా సీఎం జగన్ మద్దతు ఇస్తారని న్యాయానికి ఓటు వేయాలని కోరారు.