చిలమత్తూరు మండలంలోని నల్లరాళ్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్నాడు. ఎస్ఐ గంగాధర్ తెలిపిన మేరకు బుధవారం ఇంట్లో తన భార్యతో గొడవ పడిన నాగరాజు పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పి క్షతగాత్రుడిని హిందూపురంలోని జిల్లాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని ఎస్ఐ గంగాధర్ తెలిపారు.