గుంతకల్లు పట్టణం కసాపురం రోడ్డులోని పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోని గౌడ్ కాలనీలో ఈశ్వరమ్మ అను వృద్ధురాలు మెడలోని 3తులాల బంగారు గొలుసును బుధవారం ఇద్దరు చైన్ స్నాచర్స్ చోరీ చేశారు. ఈ విషయం తెలిసిన స్థానికులు దొంగలను పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకొని పారిపోయారు. అనంతరం కసాపురం పోలీస్ స్టేషన్ ఎస్సై దుగ్గిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.