ప్రజలదాహార్తి తీర్చడానికి ఏర్పాటు చేసిన శ్రీరామ రెడ్డి తాగునీటి పథకం ద్వారా వారం రోజులుగా నీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈపథకం ప్రధాన పైప్ లైన్ కళ్యాణదుర్గం వద్ద మరమ్మతుకు గురి కావడంతో అమరాపురం సంపునకు నీరు చేరడం లేదు. ఇక్కడి నుంచి అమరాపురం, గుడిబండ, రోళ్ల, అగళి, మడక శిరతో పాటు హిందూపురానికి నీరు చేరలేదు. అది కారులు స్పందించి మరమ్మతు చేయాలని కోరారు.