ముంచంగిపుట్టు మండలంలోని బుధవారం 18కేజీల గంజాయి పట్టుబడిందని ఎస్ఐ రవీంద్ర తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు నేతాజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద వాహనతనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా వైపు నుంచి వస్తున్న బొలెరోలో ప్లాస్టిక్ సంచుల్లో 18కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. గంజాయి బొలెరో స్వాధీనంచేసుకొని ఒడిశా కొరపుట్ కి చెందిన రంజన్, ప్రకాష్ అనే ఇద్దరిని అదుపులో తీసుకుని రిమాండ్ కు తరలించమన్నారు.