విశాఖ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబలో నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..నగరంలో పెస్ట్ కంట్రోలర్ గా మచ్చా వెంకట నూకరాజు పని చేస్తున్నారు. అయితే..ఇటీవల కుమార్తె ఓ యువకుడిని ప్రేమించడంతో ఆమెను పలుసార్లు మందలిచారు. ఆమెలో మార్పు కోసం కౌన్సిలింగ్ ఇప్పించిన ఫలితం లేకపోయింది. దీంతో మనస్థాపానికి గురైన భారాభర్తలు ఎలుకల మందు తాగారు. విషయం తెలుసుకున్న కుమార్తె, కుమారుడు కూడా అదే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్ననలుగురిలో కుమార్తె బుధవారం మృతి చెందింది.