రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర ఉండదని.. గంజాయికి మాత్రమే ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. "సీఎం జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే నా లక్ష్యం. వ్యవసాయం చేసే రైతు నష్టాల్లో ఉన్నాడు.. గంజాయి పండించే వైసీపీ నేతలు లాభాల్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గంజాయి గూండాలను ఉక్కు పాదంతో నలిపేస్తాం. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం." అని మండపేట సభలో పవన్ హామీ ఇచ్చారు.