వీరగొట్టం మండలంలోని హుస్సేన్ పురంలో బుధవారం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ప్రచారం చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి మీ అమూల్యమైన ఓటు తనకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైసిపికి చెందిన శ్రేణులు పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో పార్టీని వీడి జనసేన పార్టీలోకి చేరారు.