తన కుమార్తె అదృశమైందని మండల బేతంచేర్ల మండల పరిధిలోని ఎం, పేండేకల్లు గ్రామానికి చెందిన వ్యక్తి మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. బాలిక సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితులను విచారించినా ఆచూకి తెలియలేదు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.