ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పెద్ద మోసకారి: ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ళ మాధవి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 01, 2024, 10:15 AM

నవరత్నాల పేరుతో జగన్ రెడ్డి నవ మోసాలు చేసి ప్రజలందరి మనసులో గాయాలు ఏర్పరచారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ళా మాధవి అన్నారు. మంగళవారం 21 వీఐపీ రోడ్డు, 23 గాజుల వారి వీధి, 33వ డివిజన్ లక్ష్మీపురంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్నా తిరునగిరితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమం పేరుతో ప్రజలను దోచేసిన ఘనుడు జగన్ రెడ్డి అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి రాగానే 4000 పెన్షన్ ఇస్తాము అని హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మ్యానిఫెస్టో చాలా అద్భుతంగా ఉందని, సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో చేసే కూటమి ప్రభుత్వం తధ్యమని గళ్ళా మాధవి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com