సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోకి పొరుగు నుంచి తీసుకొస్తున్న అక్రమ మద్యాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) కమిషనర్ రవిప్రకాశ్ తెలిపారు.కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర సరిహద్దుల్లో రూ.119కోట్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. 2019లో పట్టుబడ్డ మద్యం విలువ 13.11కోట్లు కాగా ఈ ఎన్నికల్లో ఇప్పటికే 119కోట్ల మద్యం పట్టుబడిందని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా అక్రమ మద్యం నిల్వ ఉన్నట్లు, సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే 9491030853 నంబర్కు సమాచారం ఇవ్వొచ్చన్నారు. సెబ్ కార్యాలయ కంట్రోల్ రూమ్ 9154106528 లేదా 8121909444కు గానీ సమాచారం ఇవ్వాలని కమిషనర్ కోరారు.