వైసీపీ నాయకులకు తెలిసింది రౌడీయిజం, దుష్ప్రచారమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని శృంగారపురం, చుక్కపల్లివారిపాలెం, తాడిబోయినవారిపాలెం, చినపాలెం గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ......... రౌడీయిజం చేసేవారి మాటలు నమ్మొద్దన్నారు. 2014లో తండ్రి శవం, 2019లో బాబాయి శవాన్ని అడ్డుపెట్టుకుని జగన్ శవ రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, కృష్ణా జలాలను శుద్ధిచేసి పైప్లైన్ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ‘మంగళగిరిలో గెలిచాకా నా చుట్టూ మీరు తిరగడం కాదు, అభివృద్ధి చేసేందుకు మీ చుట్టూ నేను తిరుగుతాను’ అని చెప్పారు.