మేనిఫెస్టో పేరుతో ప్రజలను సీఎం జగన్ నయవంచనకు గురిచేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఇక్కడ తన అధికారిక నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘వైసీపీ మేనిఫెస్టో మోసపూరిత హామీల పుట్ట. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతానని జగన్ చెప్పారు. ఎవరు ఎవరి దగ్గర మెడలు వంచారో అందరికీ తెలుసు’ అని విమర్శించారు.