మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1 మోడల్ నియోజకవర్గంగా నారా లోకేశ్ తీర్చిదిద్దుతారని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని చైతన్య తపోవన్లో మండల స్ర్తీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా లోకేశ్ ప్రజలతో మమేకమై, ప్రతిపక్షంలో ఉండికూడా 29 సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మనసులు గెలుచుకున్నారని తెలిపారు. అధికారంలో లేకుండానే ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటే, ఎన్నికల్లో గెలిచి మరింకెంత అభివృద్ధి చేస్తారో ఆలోచించాలని సూచించారు. మహిళలకు పలు గ్యారెంటీ పథకాలను టీడీపీ అమలు చేస్తుందన్నారు. అత్యధిక మెజారిటీతో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.