ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మకూరు పర్యటనకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ను బద్వేలు టిడిపి నాయకులు జీవి సుబ్బారెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు గురించి చంద్రబాబుకు వివరించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బద్వేల్లో కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న గెలుపు తద్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపి గాలి వీస్తున్నదని తెలిపారు.