బద్వేలు మున్సిపాలిటీ 35వ వార్డులో కడప అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ సింగసాని గురు మోహన్ ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో ఆదివారం ఎమ్మెల్యే సుధా తో కలిసి ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను అభ్యర్థించారు. ముఖ్యమంత్రి జగన్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.