ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగొండపాలెం లోని పలు విధులలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఏరీక్షన్ బాబు కుమారుడు అజిత్, కుమార్తె డా. చెల్సియా లు స్పీడ్ పెంచారు. సోమవారం ఇంటింటికి తిరుగుతూ తన తండ్రి అయిన ఏరీక్షన్ బాబును, ఎంపి అభ్యర్థి మాగుంట శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు. బాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు. మండల అధ్యక్షుడు చేకూరి సుబ్బారావు పాల్గొన్నారు.