ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆదివారం బేస్తవారిపేట ఎస్ఐ నరసింహారావు వాహన తనిఖీలు నిర్వహించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉన్నత అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అక్రమంగా మద్యం మరియు నగదు తరలింపు వంటి అంశాలపై దృష్టి సారించామని ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తామన్నారు.