చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెంలో ఉంటున్న ఒడిశాకు చెందిన ఓయువతి శుక్రవారం నుంచి కనిపించక పోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఆది వారం ఫిర్యాదు చేశారు. వీరు స్థానికంగా ఓ హోటల్లో పనిచేస్తుంటారు. ఇక్కడే పనిచేస్తున్న పల్నాడు జిల్లా దుగ్గిరాలకు చెందిన యువకుడు సైతం అదే రోజు నుంచి కనిపించకపోవడంతో అతడిపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.