ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రాన్ని నాశనం చేసిన ఘనత వైసీపీకె దక్కింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 12:05 PM

రాష్ట్రంలో దోపీడీ తప్ప.. అభివృద్ధి లేదని ప్రజలు ఆలోచించి రానున్న ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులకు ఓటేయాలని టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు కోరారు. విజయనగరం పరిధిలోని పుచ్చలవీధి జంక్షన్‌, పూల్‌బాగ్‌లోని కోర్టు జంక్షన్‌లో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు పాతబస్టాండ్‌, సంతపేట, నాగవంశంవీధితో పాటు 2, 3, 4 డివిజన్లలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ, ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారన్నారు. రాష్ట్ర సెక్రటీరియేట్‌ను కూడా జగన్‌ తాకట్టు పెట్టేశారంటే పరిస్థితి ఏ విధంగా వుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రాథమిక విద్య, వైద్యం అందని ద్రాక్షలా మిగిలాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది బడికి దూరం అయ్యారన్నారు. భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే రానున్న ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి అభ్యర్థి అదితి గజపతిరాజు మాట్లాడుతూ అన్ని రకాలుగా ఇబ్బందుల్లో వున్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే చంద్రబాబు లాంటి సమర్థవంతమైన నాయకుడు అవసరమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్‌, ప్రసాదుల ప్రసాద్‌, కాళ్ల గౌరీశంకర్‌, అవనాపు విజయ్‌, అవనాపు భార్గవి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com