ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 09:31 PM

సింహాచలంలో కొలువై ఉన్న శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త. స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. అలాగే కల్యాణోత్సవాలను పురస్కరించుకుని రాత్రి 7గంటల తర్వాత రద్దు చేసిన దర్శనాలను తిరిగి కల్పిస్తున్నట్లు తెలిపారు.


విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో నాలుగు రోజుల క్రితం కళ్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది. ప్రసిద్ధ వరాహా నరసింహా స్వామి వారిని ఉదయం సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పవిత్ర గంగాధర వద్ద చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తరువాత స్వామివారిని ఆలయంలోని బేడా మండపం చూట్టూ తిరువీధి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పుష్కరిణి ప్రాంగణంలో పలు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే భక్తులు కళ్యాణ మహోత్సవంలో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొంటూ ఉత్సహంగా వేడుకలో పాల్గొన్నారు.


బుధవారం ఆలయంలో వినోద ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో జరిగే అన్ని అర్జిత సేవలు రద్దు చేశారు. ఆలయ అర్చకులు యాగశాల వద్ద శాంతి హోమాన్ని వైభవంగా జరిపారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com