ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో దొంగలు పడ్డారు, కర్రలు చేతపట్టి రండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 07:46 PM

నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో సీఎం జగన్ రెడ్డి  పీహెచ్డీ చేశారని తెలుగుదేశం పార్టీ  జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. మనల్ని మనం కాపాడుకోవాలంటే అందరం కర్రలు చేతపట్టి రోడ్ల మీదకి రావాలని పిలుపునిచ్చారు. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీలో మళ్లీ అరాచకం సృష్టిస్తుందని చంద్రబాబు విరుచుకుపడ్డారు. నెల్లూరుపాళెం కూడలిలో ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు. నెల్లూరుపాళెం కూడలి జనసంద్రంగా మారింది.కూటమి పార్టీల శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆత్మకూరు పసుపుమయంగా మారింది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో సైకో జగన్, విజయసాయి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల‌ రామకృష్ణారెడ్డి తప్పించి ఎవరూ బాగుపడలేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com