ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నామీద విమర్శలు ఏంటి?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 02:09 PM

దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని వేధించిన వారికి ఎదురొడ్డి తాను పోరాటం చేశా.. అలాంటి నన్ను అభినందించాల్సిందిపోయి నాపై ఆరోపణలు చేయటం ఏంట‌ని ఏఏజీ పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి ప్ర‌శ్నించారు. మీ తండ్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? అని  ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను నిల‌దీశారు. ష‌ర్మిల‌ రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారని, ఆమె పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ష‌ర్మిల‌ మాట్లాడారని విమర్శించారు.  తనపై షర్మిల చేసిన ఆరోపణలపై పొన్నవోలు స్పందించారు. సుధాక‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ....  కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే  ఆనాడు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని గుర్తు చేశారు. వైయ‌స్ఆర్‌పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేతల ఎర్రన్నాయుడు ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యారని పేర్కొన్నారు. 2011 ఆగస్టు 17న వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని తెలిపారు. వైయ‌స్ఆర్‌ను ఆనాడే ముద్దాయిని చేసింది నిజం కాదా.. అని ప్రశ్నించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com