ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళిత యువకుడిపై దాడి అమానుషం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 27, 2024, 02:07 PM

సీఎం వైయ‌స్‌ జగన్‌ హయాంలోనే తనకు మంచి జరిగింది అన్నందుకు ఓ దళిత యువకుడిపై బూతులు తిడుతూ దాడి చేయించి, అతని కన్నతల్లిని దుర్భాషలాడార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అబ్బ‌య్య‌చౌద‌రి మండిప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు, చింతమనేని ప్ర‌భాక‌ర్ ఇద్దరూ బాధితులకు క్షమాపణ చెప్పాల‌ని ఆయ‌న డిమాండు చేశారు. ఎన్నికల వేళ.. దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ ప్రచారంలో వీరంగం సృష్టించారు. వైయ‌స్ఆర్‌ సీపీ సంక్షేమ ప్రభుత్వం గురించి మాట్లాడిన దళితులపై తన అనుచరులతో దాడి చేయించారు. ఈ ఘటనపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. క్షతగాత్రులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, చింతమనేని తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. శుక్రవారం పెదవేగి మండలం లక్ష్మీపురం కూచిపూడి రామసింగవరం గ్రామాల్లో చింతమనేని, తన అనుచరులతో ప్రచారానికి వెళ్లారు. ఆ సమయంలో యర్ర చంటిబాబు అనే యువకుడు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మంచి జరిగిందంటూ వ్యాఖ్యానించాడు. దీంతో కోపోద్రిక్తులైన చింతమనేని అనుచరులు అతనిపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన మరికొందరు యువకులపైనా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ ఐదుగురు యువకుల్ని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరిలు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఆస్పత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com