టీడీపీ కంచుకోటలో కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు వస్తున్నదని దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడంలో వైయస్ జ గన్ సఫలమైందన్నారు. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఏమి అభివృద్ధి చేయలేదు అని డివిజన్ ప్రజలే చెబుతున్నారు. ప్రజల దీవెనలు వైఎస్ఆర్సీపీకి పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం మమ్మల్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.చంద్రబాబు, పవన్ చేసిన మోసానికే జనసైనికులు వైయస్ఆర్సీపీ వైపు ఆకర్షితులు అవుతున్నారని అవినాష్ తెలిపారు.